GENERAL KNOWLEDGE - భారత రాజ్యాంగము

భారత రాజ్యాంగము 

భారత రాజ్యాంగము ఎప్పుడు అమలులోకి వచ్చింది
- జనవరి 26,1950 
భారత రాజ్యాంగము అమలులోకి వచ్చిన సమయములో ప్రకరణల సంఖ్య
-395 
భారత రాజ్యాంగము న్యాయవాదుల స్వర్గం అని వ్యాఖ్యానించినది
- ఐవర్ జెన్నింగ్స్ 
భారత రాజ్యాంగము యొక్క చిహ్నం
- ఏనుగు 
భారత రాజ్యాంగము జనవరి 26 నుంచే అమలులోకి రావడానికి కారణం
- పూర్ణస్వరాజ్ దినం 
భారత రాజ్యాంగము యొక్క ఆశయాలు, లక్ష్యాలు ఎందులో వివరించబడ్డాయి
- పీఠిక (ప్రియంబుల్)
భారత రాజ్యాంగమును ఎవరు రచించారు
- భారత రాజ్యాంగ పరిషత్ 
భారత రాజ్యాంగ పరిషత్తు యొక్క అధ్యక్షుడు
- రాజేంద్రప్రసాద్
భారత రాజ్యాంగము యొక్క ప్రత్యేకత
- ప్రపంచం లొనే అతిపెద్ద రాజ్యాంగం 
భారత రాజ్యాంగము ఏ రోజున రాజ్యాంగ పరిషత్తుచే ఆమోదించబడినది
- నవంబర్ 26,1949
అంబేద్కర్ ఏ హక్కును రాజ్యాంగపు ఆత్మగా పేర్కొన్నాడు
- రాజ్యాంగ పరిహారపు హక్కు.
రాజ్యాంగ ప్రవేశికకు ఇప్పటివరకు ఎన్నిసార్లు సవరించారు
- ఒక్కసారి.
భారత రాజ్యాంగ ప్రవేశిక ఏ వాక్యంతో ప్రారంభమౌతుంది
- భారత ప్రజలమైన మేము......
రాజ్యాంగ సభ తొలి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు
- సచ్చిదానంద సిన్హా.
రాజ్యాంగంలోని తొలి ప్రకరణ దేన్ని తెలుపుతుంది
- భారతదేశము రాష్ట్రాల సమాఖ్య అని.
భారత రాజ్యాంగ రచనకు ఎంత ఖర్చు అయింది
- రూ.63,70,729/-.
రాజ్యాంగంలో గుర్తించబడిన బాషలు ఏ షెడ్యూల్డ్‌లో చేర్చబడ్డాయి
- 8వ షెడ్యూల్డ్.
భారత రాజ్యాంగంలో చిన్నది మరియు విలువైన ప్రకరణ
- 21 (జీవించే హక్కు).
రాజ్యాంగం అమలులోకి రాకముందు పార్లమెంటును ఏమని పిల్చేవారు
- ప్రొవిజనల్ పార్లమెంటు.
భారత రాజ్యాంగంలో సంక్షేమ రాజ్యస్థాపన అనే భావన ఏ భాగంలో ఉంది
- ఆదేశిక సూత్రాలు.

collected by
Sri Lokanadh,
East Godavari District

    

Post a Comment

Previous Post Next Post